మమతా బెనర్జీ  పార్టీలోకి క్రికెట‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న

-

ప‌శ్చిమ బెంగాల్ లో రాజ‌కీయంగా అన్నీ పార్టీలు యాక్టీవ్ అవుతున్నాయి, కొంద‌రు సెల‌బ్రెటీలు రాజ‌కీయంగా అడుగులు వేస్తున్నారు, త‌మ‌కు న‌చ్చిన పార్టీల్లో చేరుతున్నారు, తాజాగా
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్టు క్రికెటర్ మనోజ్ తివారీ ప్రకటించాడు.  మీ అంద‌రి ప్రేమ మ‌ద్ద‌తు నాకు అవ‌స‌రం అని ఆయ‌న తెలిపాడు ట్విట‌ర్ వేదిక‌గా.మనోజ్ తివారీ మ‌న దేశం త‌ర‌పున క్రికెట్ ఆడాడు…వన్డేలు, టీ20 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ఆడాడు మ‌నోజ్ . ఇక ఆయ‌న తృణ‌ముల్ లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌‌గానే పార్టీ నేత‌లు చాలా సంతోషించారు.నాలుగు వారాల క్రితం తివారీని పార్టీ నేత‌లు క‌లిశారు, ఇక లక్ష్మీ రతన్ శుక్లా ఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేశారు, అయితే ఆయ‌న స్ధానాన్ని మ‌నోజ్ భ‌ర్తీ చేస్తారు అని భావిస్తున్నారు పార్టీ నేత‌లు..
లక్ష్మీ రతన్ శుక్లా హౌరా జిల్లా క్రికెట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.  టీఎంసీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారాయ‌న‌.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...