రెండు రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ నేడు పరుగులు పెట్టింది… ఒక్కసారిగా పుత్తడి వెండి ధరలు నేడు మార్కెట్లో కాస్త పెరుగుదల నమోదు చేశాయి, ఇక ఇన్వెస్టెర్లు చాలా వరకూ పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు ఇదే రేటు పెరగడానికి ప్రధాన కారణం అంటున్నారు అనలిస్టులు.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.46,970కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 పెరుగుదలతో రూ.43,050కు చేరింది, అయితే గడిచిన నాలుగు రోజులుగా చూస్తే ఇంత రేటు పెరగడం ఇదే తొలిసారి అంటున్నారు నిపుణులు.
బంగారం పెరిగింది మరి వెండి రేటు కూడా ఇదే దారిలో పెరిగింది. వెండి ధర కేజీకి రూ.800 పెరిగింది. దీంతో రేటు రూ.73,300కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు.