బ్రేకింగ్ – పెళ్లి తర్వాత అప్పగింతల్లో దారుణం – వధువు మృతి

-

పెళ్లి చేసుకుని పుట్టినింటి నుంచి అత్తవారి ఇంటికి  వెళ్తుంటే.. ఏ అమ్మాయికైనా బాధ వస్తుంది.. అప్పటి వరకూ తల్లిదండ్రులు అన్న,చెల్లెలు,తమ్ముడు, అక్క అందరితో ఉండి కొత్త వ్యక్తితో జీవితంలోకి వెళుతుంది.. ఈ సమయంలో వివాహం తర్వాత అప్పగింతలు ఉంటాయి.. ఇక ఆ సమయంలో కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తాయి.. ఇది ఎవరికి అయినా జరిగేదే.. ఆ సమయంలో అందరూ బాధపడుతూ ఉంటారు.
ఒడిశాలోని బాలానగర్ జిల్లా తెటెల్ గావ్ కు చెందిన బిశికేశన్ అనే యువకుడితో గుప్తేశ్వరి సాహూ అలియాస్ రోసీ సాహూకు
వివాహం జరిగింది.. ఈ సమయంలో అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో అప్పగింతలు అయ్యాయి, అయితే ఎంతో వెక్కి వెక్కి ఏడ్చింది పెళ్లికూతురు.
చివరకు నీరసించిపోయి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ అమ్మాయిని స్పృహలోకి తెచ్చేందుకు కుటుంబ సభ్యులు,  ప్రయత్నించినా ఫలితం లేదు. ఆమె అలాగే ఉండిపోయింది.. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు.. కాని ఆమె చనిపోయింది అని వైద్యులు తేల్చారు. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...