మన దేశంలో అతి పెద్ద బీమా సంస్ధ అంటే వెంటనే చెప్పేది ఎల్ ఐ సీ.. అయితే అనేక పాలసీలు తీసుకువస్తుంది ఎల్ ఐసీ,
కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు.. అయితే తాజాగా తమ పాలసీ దారులకి ఓ గుడ్ న్యూస్ అందించింది…కరోనా కారణంగా క్లెయిమ్ విషయంలో పాలసీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ముందడుగు వేసింది బీమా సంస్ధ. ఇప్పటికే మెచ్యూరిటీ తీరిన పాలసీలను తమ సమీప ఎల్ఐసీ కార్యాలయాల్లోనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అవకాశం ఇక 11 రోజులు మాత్రేమే ఈ నెలాఖరు వరకూ ఈ ఛాన్స్ ఇచ్చింది.
ఇక పాలసీ క్లెయిమ్ కోసం మీకు దగ్గరల్లో ఉన్న ఎల్ ఐ సీ కార్యాలయానికి వెళ్లండి, దీనికి సంబంధించి డాక్యుమెంట్లు
ఆఫీసులో అప్పగించాలి… అయితే మీరు తీసుకున్న బ్రాంచ్ లోనే కాదు, ఏ సమీప బ్రాంచ్ నుంచైనా మెచ్యూరిటీ క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఎల్ఐసీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న113 డివిజనల్ ఆఫీసులు, 2,048 బ్రాంచులు, 1,526 శాటిలైట్ ఆఫీసులు, 74 కస్టమర్ జోన్లలో ఈ సర్వీసులను పొందవచ్చని స్పష్టం చేసింది. ఇక మీరు ఎక్కడ పాలసీ క్లెయిమ్ దరఖాస్తు చేసుకున్నా, చెల్లింపు మాత్రం సర్వీస్ బ్రాంచు ఏది ఉందో అక్కడ నుంచే వస్తుంది.. దేశంలో మొత్తం 29 కోట్ల పాలసీలు అందిస్తోంది ఎల్ ఐసీ.
|
|
బ్రేకింగ్ – ఎల్ఐసీ పాలసీదారులకు గుడ్ న్యూస్ – ఈ నెలాఖరు వరకూ ఛాన్స్
-