బ్రేకింగ్ న్యూస్ – ఉద్యోగులకి తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

-

తెలంగాణలో ఉద్యోగులకి గు్డ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్.. చాలా రోజులుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై కీలక ప్రకటన వచ్చేసింది..పీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 30శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఉద్యోగులు చాలా ఆనందలో ఉన్నారు.
ఇక ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది…ఈ పీఆర్సీతో 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, గత ఏడాది నుంచి కరోనా వల్ల ఆర్దిక మాంద్యం కారణంగా పీఆర్సీ లేట్ అయిందని తెలిపారు, ఇక మరో గుడ్ న్యూస్ ఏమిటి అంటే.
ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెంచుతున్నట్టు తెలిపారు.  ఇక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది, వారు కీలక పాత్ర పోషించారు, ఇక అన్నీ విభాగాల్లో ఉద్యోగులకి ఈ పీఆర్సీ వస్తుందని తెలిపారు.
ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...