తెలంగాణ కరోనా కేసులు : ఆ మూడు జిల్లాల్లోనే త్రిబుల్ డిజిట్, ఆ నాలుగు జిల్లాల్లో సింగిల్ డిజిట్

0
71

కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ బలహీనపడిపోతున్నది. తెలంగాణలో కేసుల సంఖ్య గడిచిన వారం రోజులుగా గణనీయంగా తగ్గిపోతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టడంతోపాటు మరోవైపు టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచింది. దీంతో కరోనా కట్టడి సులభతరమైంది. అయితే ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశమంతా కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోతున్న పరిస్థితి ఉంది.

అయితే తెలంగాణలో మూడు జిల్లాల్లో మాత్రం త్రిబుల్ డిజిట్ స్థాయిలో కేసులు కొనసాగుతున్నాయి. అందులో ఇవాళ జిహెచ్ఎంసిలో 158 కేసులు నమోదు కాగా, నల్లగొండ జిల్లాలో 147 కేసులు, ఖమ్మంలో 124 కేసులు నమోదయ్యాయి.

ఇక సింగిల్ డిజిట్ స్థాయిలో కేసలు నమోదైన జిల్లాలు చూస్తే ఆదిలాబాద్ లో 5 కేసులు, కామారెడ్డి లో 6, నిర్మల్ లో 5 కేసులు, కొమరంభీం ఆసిఫాబాద్ లో 6 కేసులు నమోదయ్యాయి.

మిగిలిన జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి.

భద్రాద్రి కొత్తగూడెం 95 కేసులు

జగిత్యాల 32

జనగామ 16

జయశంకర్ భూపాలపల్లి జిల్లా 44

జోగులాంబ గద్వాల 17

కరీంనగర్ 84

మహబూబ్ నగర్ 54

మహబూబాబాద్ 81

మంచిర్యాల 70

మెదక్ 13

మేడ్చల్ మల్కాజ్ గిరి 79

ములుగు 39

నాగర్ కర్నూల్ 30

నారాయణపేట 12

నిజామాబాద్ 13

పెద్దపల్లి 66

రాజన్న సిరిసిల్ల 38

రంగారెడ్డి 96

సంగారెడ్డి 36

సిద్దిపేట 67

సూర్యాపేట 68

వికారాబాద్ 32

వనపర్తి 36

వరంగల్ రూరల్ 31

వరంగల్ అర్బన్ 67

యాదాద్రి భువనగిరి 40

రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు ఇవీ…

గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,24,066 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,707 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం  5.30 గంటల వరకు కరోనాతో 16 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,456కి చేరింది.

కరోనా నుంచి ఇవాళ 2,493 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 1009 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.

కొత్త కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కరోనా సెకండ్ వేవ్ బలహీనపడుతున్నట్లే కనబడుతున్నదని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ రక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.