యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత వెండి తెరపై కనిపించలేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షో త్వరలోనే జెమినీలో ప్రసారం కానుంది. ఆగస్ట్ 15న స్వతంత్య్ర దినోత్సవ కానుకగా తొలి ఎపిసోడ్ ప్రసారం కానుందని ప్రచారము జరుగుతుంది.
ఇక దీని కోసం బిగ్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు, ఇక తారక్ కి భారీ రెమ్యునరేషన్ సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ తాజాగా
సోగ్గాడే చిన్ననాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో వర్క్ చేస్తున్నారట. మరి అది సినిమా కోసం కాదు
ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం.
ఈ దర్శకుడు ఈ షో ప్రోమోలు డైరెక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్ ఈ షో ప్రోమోస్ డైరెక్ట్ చేయాలనుకున్నారు కాని కుదరలేదు. ఒక ప్రోమో తీశారని తెలుస్తోంది. ఇంకా ఈ షో కోసం మరో 5 ప్రోమోలు కూడా డిజైన్ చేసారు మేకర్స్. వీటిని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బంగార్రాజు సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.