కేంద్ర వైఖరికి నిరసనగా సభ నుంచి విజయసాయి వాకౌట్‌

కేంద్ర వైఖరికి నిరసనగా సభ నుంచి విజయసాయి వాకౌట్‌

0
108

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేట్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చించారు. బిల్లు వాపసు తీసుకోవాలని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్ కోరారు. బిల్లుపై ఓటింగ్‌ జరపాలని విజయసాయి పట్టుబట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున సభలో సగంమంది సభ్యులు ఉండాలని వైస్‌చైర్మన్‌ చెప్పారు. బిల్లుపై ఓటింగ్‌ సాధ్యం కాదని మరోసారి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విజయసాయిరెడ్డి సభ నుంచి వాకౌట్‌ చేశారు.