Flash- తెలంగాణలో దారుణం..మహిళపై సామూహిక అత్యాచారం

0
57

ఆడవారిపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అరాచకాలను ఆపలేకపోతున్నారు. తాజాగా..రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో మహిళపై కొందరు కీచకులు సామూహిక అత్యాచారం చేశారు. మద్యం మత్తులో ఉన్న తనను ఆటోలో తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అత్యాచారం చేసిన అనంతరం మెడలోని పుస్తెలతాడు..తన వద్ద ఉన్న నగదు దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.