Breaking News: ధాన్యం కుప్ప వద్దే రైతు శంకర్ ఆత్మహత్య

Farmer Shankar commits suicide at a grain heap

0
61

తెలంగాణలో మరో రైతు తనువు చాలించాడు. ధాన్యం కుప్ప కాపలాకు వెళ్లిన రైతు శంకర్‌ ధాన్యం కుప్ప వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు శంకర్‌ భార్య తెలిపింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌లో ఈ ఘటన జరిగింది. అతని మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.