Flash News- ప్రయాణికుల లగేజీతో ఉడాయించిన డ్రైవర్​ దొరికాడు..ఆ ప్లాన్ ఎవరిదంటే?

0
67

కేరళ నుంచి అసోంకు వెళ్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికుల సామాన్లు, డబ్బులతో పరారైన డ్రైవర్​ పోలీసులకు దొరికిపోయాడు. ఈ నెల 5న ఉడాయించిన డ్రైవర్​, క్లీనర్​..ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.​ వారి నుంచి ప్రయాణికులు లగేజీతో పాటు 18 సెల్​ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేరళలో పనులు చేసుకొని పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లాలనుకున్నారు వలస కూలీలు. వారంతా… బిహార్, బెంగాల్, నేపాల్, అసోంకు చెందినవారు. ఏజెంట్‌ ద్వారా ఒక్కొక్కరు 3 వేల 500 రూపాయలు చెల్లించి ప్రైవెేటు ట్రావెల్స్​లో బస్సు టికెట్లు బుక్​ చేసుకున్నారు. కానీ ఈ నగదుతో బస్సు ఓనర్లు సంతృప్తి పళ్లేదు. అంత దూరం వెళ్తే తమకు ఏమీ లాభం లేదనుకున్నారు. కూలీలను మధ్యలోనే వదిలేయాలని మోసపూరిత ఆలోచన చేశారు. ఈ నెల 3 తారీఖున కేరళ నుంచి అస్సాంకు 64 మంది ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్​కు చెందిన బస్సు బయలుదేరింది. రెండు రోజుల ప్రయాణం తర్వాత.. 5న నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి బస్సు చేరుకుంది. బస్సు ఓనర్లు అనుకున్నట్టే నార్కట్​పల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద అల్పాహారం కోసం బస్సును ఆపారు. ప్రయాణికులంతా తినేందుకు కిందకు దిగారు. ఇదే అదునుగా భావించిన డ్రైవర్‌, క్లీనర్‌ ప్రయాణికుల లగేజీతో ఉడాయించారు.

వెంటనే ప్రయాణికులు నార్కట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నార్కట్​పల్లి సీఐ శంకర్ రెడ్డి, ఎస్సై యాదయ్య.. కేరళ వెళ్లారు. నిందితులను గుర్తించి వారిని నార్కట్​పల్లికి తరలించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం వల్ల డ్రైవర్​ను పట్టుకోవటం పోలీసులకు సమస్యగా మారింది.