అయ్యప్ప భక్తులకు శుభవార్త..శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

Good news for Ayyappa devotees..Special trains for Sabarimala .. Full details ..

0
71

అయ్యప్ప భక్తులకు శుభవార్త. భక్తుల డిమాండ్ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రత్యేకంగా రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే ఉన్న రైళ్లకు తోడుగా ఏడు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొల్లాం నుంచి సికింద్రాబాద్, కాచిగూడ నుంచి కొల్లాం, కొల్లాం నుంచి కాచిగూడ, నాందేడ్ నుంచి కొల్లాం, కొల్లాం నుంచి తిరుపతి, తిరుపతి – నుంచి నాందేడ్ మీదుగా ట్రైన్స్ నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటన మేరకు..

1. ట్రైన్ నెంబర్ – 07133 – సికింద్రాబాద్-కొల్లాం: డిసెంబర్ 18, 2021(శనివారం) న సికింద్రాబాద్ నుంచి ఉదయం 5.40 నిమిషాలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే ఆదివారం మధ్యాహ్నం 13.50 గంటలకు కొల్లాం కు చేరుకుంటుంది.

2. ట్రైన్ నెంబర్ – 07134 – కొల్లాం – సికింద్రాబాద్: డిసెంబర్ 19, 2021(ఆదివారం) రోజున కొల్లాం నుంచి సాయంత్రం 19.35 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే మంగళవారం తెల్లవారుజామున 03.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

3. ట్రైన్ నెంబర్ – 07135 – కాచిగూడ – కొల్లాం: డిసెంబర్ 22, 2021(బుధవారం) రోజున కాచిగూడ నుంచి ఉదయం 05.30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటు గురువారం 13.50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

4. ట్రైన్ నెంబర్ – 07136 – కొల్లాం – కాచిగూడ: డిసెంబర్ 23, 2021(గురువారం) రోజున కొల్లాం నుంచి బయలుదేరుతుంది. శనివారం నాడు తెల్లవారుజామున 03.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

5. ట్రైన్ నెంబర్ – 07137 – నాందేడ్ – కొల్లాం: డిసెంబర్ 23, 2021(గురువారం) రోజున ఉదయం 09.45 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి.. శుక్రవారం నాడు రాత్రం 21.40 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

6. ట్రైన్ నెంబర్ – 07506 – కొల్లాం – తిరుపతి: డిసెంబర్ 25, 2021(శనివారం) రోజున తెల్లవారుజామున 00.45 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి.. అదే రోజు సాయంత్రం 17.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

7. ట్రైన్ నెంబర్ – 07138 – తిరుపతి – నాందేడ్: డిసెంబర్ 26, 2021(ఆదివారం) రోజున రాత్రం 20.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు అంటే సోమవారం సాయంత్రం 15.00 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.