Flash: ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు

Minister Gautam Reddy's funeral with government formalities

0
132

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీనితో వైసీపీలో విషాదం నెలకొంది. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్నారు. మంత్రి మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.