సియోల్‌ ను ముంచెత్తిన కుంభవృష్టి..8 మంది మృతి

0
65

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు హడలెత్తిస్తున్నాయి. సోమవారం రాత్రి కుంభవృష్టి కురియడంతో భారీగా వరదలు వచ్చాయి. దీనితో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. సియోల్‌లో భారీ వర్షపాతానికి రవాణా సౌకర్యాలు మొత్తం నిలిచిపోయాయి. నగరంలో రైల్వే సేవలు పూర్తిగా ఆగిపోయాయి.