నిండా ముంచిన ఆర్ధిక సంక్షోభం..264 శాతం ధరలు పెంపు..ఎక్కడో తెలుసా?

0
68

శ్రీలంక వాసులకు ‘సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌’ బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా  విద్యుత్‌ ధరలను 264 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. 30 కిలోవాట్లలోపు విద్యుత్‌ ధరలను 264 శాతం, 180 కిలోవాట్లకు మించి వినియోగించేవారికి 80 శాతం మేర పెంచినట్లు తెలిపింది. బుధవారం నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన ధరలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే వాస్తవానికి 800 శాతం కంటే ఎక్కువగా ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని సీఈబీ కోరింది. కానీ.. గరిష్ఠంగా 264 శాతానికి అనుమతి దక్కిందని అధికారులు తెలిపారు. తాజా పెంపుతో.. నెలకు 90 కిలోవాట్ల కంటే తక్కువ విద్యుత్‌ వాడుతున్న 78 లక్షల పేద కుటుంబాల్లో మూడింట రెండొంతులు ప్రభావితమవుతాయని చెప్పారు.

ప్రస్తుతం ఇక్కడ చిన్న వినియోగదారులకు యూనిట్‌కు 2.50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. తాజా పెంపుతో ఇది ఎనిమిదికిపైగా చేరుకోనుంది. అదే నెలకు 180 కిలోవాట్లకు మించి వినియోగించేవారు యూనిట్‌కు 45 రూపాయల చొప్పున చెల్లిస్తుండగా.. ఇప్పుడది సుమారు 75కి చేరుకోనుంది.