బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం..గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

0
182

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థుల నుంచి 35 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. వారిని బైంసా మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చారు.

”కాలేజీ క్యాంపస్ లో విద్యార్థులు గంజాయి సేవిస్తూ కనిపించారు. వర్సిటీలో ఆ ఇద్దరు విద్యార్థులు ఈ2 కోర్సు చదువుతున్నట్టు చెప్పారు. వారి హాస్టల్ దగ్గర నిషేధిత మత్తు పదార్ధం తీసుకుంటూ కనిపించారు. అనుమానం వచ్చి వారిని అదుపులోనికి తీసుకున్నాం. ఆ ఇద్దిరినీ విచారించాము. గంజాయి సేవించినట్లు ఆ ఇద్దరు ఒప్పుకున్నారు. తమ స్నేహితుడు నాందేడ్ కు చెందిన విద్యార్థి ద్వారా తమకు గంజాయి అందినట్లు వారు విచారణలో చెప్పారు. ఆ ఇద్దరు విద్యార్థులను జుడిషియల్ రిమాండ్ కు తరలించాము. కేసు నమోదు చేశాము. విచారణ జరుగుతోంది” అని ముధోల్ ఇన్ స్పెక్టర్ వినోద్ తెలిపారు.