మునుగోడు ప్రచారానికి జీవిత రాజశేఖర్‌?

-

మునుగోడులో ఉప ఎన్నికకను నవంబర్‌ 3న ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల కమిషన్‌ ప్రకటించటంతో, తెలంగాణలోని అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎలాగైనా తమ పవర్‌ను నిరూపించుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తుండగా.. తమ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ సాయశక్తుల ప్రయత్నం చేస్తోంది. ఇక తెలంగాణాలోని తమ పాగా వేయాలని బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో భాగంగానే మునుగోడులో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులను కదుపుతోంది. మునుగోడులో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన జీవిత రాజశేఖర్‌ను సంప్రదించినట్లు సమాచారం. అందుకు ఆమె సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్‌ జీవతకు ఫోన్‌ చేసి, మునుగోడులో బీజేపీ తరఫున ప్రచారం చేయాల్సిందనిగా ఆహ్వానించటంతో.. జీవిత తప్పకుండా చేస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈటెల భార్యతో కలిసి, జీవిత రాజశేఖర్‌ మునుగోడులో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...