GSLV-3: మైలురాయి ప్రయోగానికి సర్వం సిద్ధం

-

GSLV-3: మరో మైలురాయి లాంటి ప్రయోగానికి ఇస్రో సిద్ధమయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జీఎస్‌ఎల్వీ మార్క్‌-3ను నింగిలోకి పంపించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 23న జీఎస్‌ఎల్వీ-3 (GSLV-3) అందరిక్షంలోకి దూసుకువెళ్లనుంది. ఇందుకు తిరుపతి జిల్లా శ్రీహరి కోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రాకెట్‌ ద్వారా ఒకేసారి 36 కమర్షియల్‌ ఉపగ్రహాలను రోదసీలోకి పంపించనున్నారు. ఎన్‌ఎస్‌ఐఎల్‌ తో ఒప్పందం తరువాత నిర్మాణం అయిన తొలి బరువైన రాకెట్‌ ఇదే కావటం విశేషం. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్‌ను రూపొందించారు.

- Advertisement -

వాస్తవానికి ఈ రాకెట్‌ను ఎప్పుడో ప్రయోగించాల్సింది.. కానీ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఇప్పుడు (GSLV-3) ప్రయోగానికి సిద్ధమయ్యింది. ఎల్‌ వీఎం-3గా ఈ ప్రయోగం ఎన్‌ఎస్‌ఐఎల్‌తో పాటు ఇస్రోకు కూడా ఓ మైలురాయి లాంటి ప్రయోగం ఇది. ఉపగ్రహాలు విడిచిపెట్టే ప్రదేశానికి సమీపంలో గ్రౌండ్‌ స్టేషన్‌ అందుబాటులో లేకపోవటంతో, అతిపెద్ద షిప్‌లలో ఈ భూకేంద్రాన్ని వినియోగించుకోవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉపగ్రహాలను పసిగట్టే. గ్రౌండ్‌ స్టేషన్‌ను ఈ నెల 1 నుంచే చెన్నై షిప్‌ల ద్వారా అంటార్కిటికా వైపు మళ్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 14కు ఇవి అక్కడకి చేరుకుంటే, రాకెట్‌ ప్రయోగ సమయాన్ని వెల్లడిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...