Bharat Jodo Yatra: ఏపీలోకి ప్రవేశించింన రాహుల్ గాంధీ

-

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పటికే ఈ యాత్ర కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. కర్నూలు జిల్లా చేత్రగుడి నుంచి పాదయాత్ర మెుదలు కాగా.. పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో మెుత్తం 4 రోజులు, 119 కి.మీ మేర రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుంది. నేడు ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పాదయాత్ర చేయనున్నారు. మధ్యాహ్నాం లంచ్‌ బ్రేక్‌లో పోలవరం నిర్వాసితులతో రాహుల్‌ ముచ్చటించనున్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైపోతున్న తరుణంలో రాహుల్‌ గాంధీ చేస్తున్న ఈ యాత్ర, పార్టీ వర్గాల్లో జోష్‌ నింపింది. ఈ ఉత్సాహంతో, పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కరివేపాకుతో కమ్మని ఆరోగ్యం మీ సొంతం..

కరివేపాకుతో(Curry Leaves) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కరివేపాకులు ఎలా తీసుకున్నా...

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...