T20 World cup: భారత్‌-న్యూజిలాండ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ రద్దు

-

T20 World cup: బ్రిస్బేన్‌ వేదికగా జరగాల్సిన టీ-20(T20 World cup) భారత్‌- న్యూజిలాండ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. భారీ వర్షం గబ్బా మైదానాన్ని ముంచెత్తటంతో, మ్యాచ్‌ను రద్దు చేస్తూ, ఎంపైర్లు ప్రకటించారు. ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌పైనా అనుమానాలు నెలకొన్నాయి. మ్యాచ్‌ జరిగే రోజు మెల్‌బోర్న్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణం హెచ్చరించింది. ఒకవేళ వర్షం పడితే కుంభవృష్టిలా కురుస్తుందని నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఇదే జరిగితే, మ్యాచ్‌ రద్దవుతుందని పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మెగా టోర్నీలు ఎలా నిర్వహిస్తున్నారని ఐసీసీపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఆయా మ్యాచ్‌లు రద్దు అయితే, పాయింట్లలో కోత పడి, టోర్నీ విజయవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ప్రపంచం మెుత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. అటువంటిది ఈ మ్యాచ్‌ కానీ రద్దు అయితే అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యే అవకాశాలున్నాయి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...