T20 world cup 2022: నరాలు తెగే ఉత్కంఠ పోరులో భారత్‌ ఘన విజయం

-

T20 world cup 2022 :మెల్‌బోర్న్‌ వేదికగా ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ఓవర్‌లో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్‌ సాగింది. నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ పాక్‌పై విజయం సాధించింది. ఒంటి చేత్తో విరాట్‌ కోహ్లీ (82*) టీమిండియాకు విజయం అందించాడు. టాస్‌ గెలిచి.. భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, పాక్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 159 పరుగులు చేసింది పాక్‌ జట్టు. షాన్‌ మసూద్‌ (52*), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51) రన్స్‌ చేసి టీమిండియా ముందు భారీ స్కోరునే పెట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. విజయవకాశాలు ఎండమావిగా మారిన తరుణంలో, విరాట్‌ కోహ్లీ-హార్థిక్‌ పాండ్యా జట్టును ఆదుకున్నారు. ఇద్దరు భాగస్వామ్యంగా సెంచరీ బాదిన అనంతరం పాండ్యా ఔట్‌ అయ్యాడు. కోహ్లీ చివరి వరకు క్రీజులోనే పోరాడి.. జట్టును గెలిపించాడు. చివరి ఓవర్‌లో పాకిస్థాన్‌ ఒత్తిడి చేసిన తప్పిదాలే.. భారత్‌కు విజయవకాశాలుగా మారాయి. మ్యాచ్‌ గెలిచిన అనంతరం కోహ్లీను రోహిత్‌ ఎత్తుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...