Vanaparthi : వృద్ధ మహిళ హత్య..గొంతు నులిమి.. ఆపై

-

Vanaparthi an old woman was killed with her throat slit: వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ మహిళ దారుణ హత్యకు గురైంది. కొందరు దుండగులు మహిళను గొంతు నులిమి హత్య చేసారు. వనపర్తి జిల్లాలోని నడిమి గేరి జోషి హాస్పిటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వరలక్ష్మి (68) వడ్డీలిస్తూ జీవనం కొనసాగిస్తుండేది. అయితే.. ఉదయం తన ఇంట్లోనే శవమై కనిపించింది. కొందరు దుండగులు ఇంటి వెనక ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశించి వరలక్ష్మిని గొంతు నులిమి హత్య చేసారు. మృతురాలి ఇంటి నుంచి 30 తులాల బంగారం, రూ.15 లక్షలు చోరికి గురైనట్లు తెలుస్తుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...