PM Modi: గో బ్యాక్ మోడీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ.. నల్లబెలూన్లతో నిరసన

-

Protest with black balloons to protest Ts PM Modi visit: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు నేడు రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. ‘‘గో బ్యాక్ మోడీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలిశెట్టి అరవింద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. `మోడీ ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చినట్టే ఇచ్చి అనంతరం వాటిని ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. మోడీని అడ్డుకునేందుకు హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్తున్న ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం, ఇతర నేతలను పోలీసులు సిద్దిపేట వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...