Kane Williamson: కివీస్‌కు షాక్‌.. టీ20కు విలియమ్సన్‌ దూరం

-

New Zealand team captain Kane Williamson exit from 3rd T20 match: భారత్‌ చేతిలో రెండవ టీ20 మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన న్యూజిలాండ్‌ టీమ్‌కు మరొక షాక్‌ తగలింది. మెడికల్‌ అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ కావటంతో.. ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మూడవ టీ20కు దూరం కానున్నాడు. దీంతో కేన్‌ స్థానంలో టిమ్‌ సౌధీ కెప్టెన్‌గా వ్యవహరించి.. టీమ్‌ను ముందుండి నడిపించనున్నాడు. అయితే ఇప్పటికే మెుదటి టీ 20 మ్యాచ్‌ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది కివీస్‌ జట్టు. సిరీస్‌ గెలిచే అవకాశం కివీస్‌కు లేకున్నా.. కనీసం.. సిరీస్‌ను సమం చేయాలనుకుంటే.. న్యూజిలాండ్‌ తప్పక ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఇటువంటి కీలక మ్యాచ్‌కు కేన్‌ దూరం కావటం న్యూజిలాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పుకోవచ్చు. రెండవ టీ20 మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు.. ఒంటరి పోరాటం చేసినా.. ఫలితం లేకుండా పోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...