AP BC Ministers Meeting: నేడు తాడేపల్లిలో బీసీ మంత్రుల సమావేశం

-

AP BC Ministers Meeting at Thadepalli CM camp office: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు బీసీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముత్యాలనాయుడుతో పాటు ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం జగన్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకర్షించేందుకు, ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఇతర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎటువంటి సంక్షేమ పథకాలను అందించారో, ప్రజలకు ఏ విధంగా వివరించాలో, ప్రతిపక్షాల ఆరోపణలు సమర్థవంతంగా ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై ఈ భేటీ (AP BC Ministers Meeting)జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...