Bus overturned :స్కూల్ బస్సు బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు

-

Bus overturned while going on a vacation to Kadiam in East Godavari district: ఖమ్మం జిల్లా సత్తుపల్లి గీతమ్స్ డిగ్రీ కాలేజికి చెందిన 40 మంది విద్యార్ధినులు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియంకు విహారయాత్రకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. ప్రధానమైన రహదారి మీదునుంచి కాకుండా మరో రహదారి నుంచి సత్తుపల్లి కి సమీపంలోకి వస్తుండగా అశ్వరావుపేట మండలం పాపిడి గూడెం వద్ద బోల్తా పడింది. కాగా.. ఈ బస్సులో 40 మంది డిగ్రీ చదువుతున్న విద్యార్థినిలు ఉండగా వారిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినులు విజ్ఞాన టూర్ కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని కడియంకి వెళ్లి వస్తున్నారు. అయితే .. ఎదురుగా వస్తున్న వ్యాన్‌‌ను తప్పించే క్రమంలో, తీవ్రమైన పొగ మంచు కారణంగా బస్సు ( Bus overturned) ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన పై సమాచారం అందుకున్న అశ్వారావుపేట పోలీసులు ఘటన స్థలనికి చేరుకుని గాయపడిన విద్యార్థినులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థినులు స్వల్ప గాయాలతో బయటపడారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...