PM Modi: కందుకూరు దుర్ఘటనపై మోడీ దిగ్భ్రాంతి.. బాధితులకు ఆర్థిక సాయం

-

PM Modi Expresses Regret Over Kandukur Incident and announces ex-gratia to kin of deceased: నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్డు షో లో జరిగిన దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ప్రధాని తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.

- Advertisement -

మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా బుధవారం రాత్రి కందుకూర్ లో చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చంద్రబాబు రోడ్ షో కి భారీగా జనం తరలివచ్చారు. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా జనం కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది టిడిపి కార్యకర్తలు పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయారు. దీంతో ఊపిరాడక ఎనిమిది మంది కార్యకర్తలు ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు రూ.15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే వారి కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా వారిని చదివిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Read Also: అప్పుడు 29.. ఇప్పుడు 8.. బాబు పై కేసు పెట్టాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...