హిండెన్ బర్గ్ నివేదిక ఎఫెక్ట్.. అదానీకి భారీ షాక్

-

Adani group shares falls down after the Hindenburg research report: అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదిక అదానీ గ్రూప్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నివేదిక పై స్పందించిన అదానీ గ్రూప్.. హిండెన్ బర్గ్ ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని, తమ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నివేదికను విడుదల చేశారని వివరణ ఇచ్చింది. సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ షేర్ల పతనం మాత్రం ఆగలేదు. దీంతో రెండు రోజుల్లోనే అదానీ గ్రూపునకు చెందిన నమోదిత కంపెనీల షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ.4.17 లక్షల కోట్ల మేర ఆవిరైంది. హిండెన్ బర్గ్ ఆరోపణల ప్రభావం నిన్న ప్రారంభమైన అదానీ(Adani) ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) పైనా పడింది. అదానీ గ్రూపు షేర్ల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజులుగా నష్టాలను చవిచూస్తున్నాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...