ఉత్సాహంగా ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023

-

Inorbit Durgam Cheruvu run 2023: మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ (ఐడీసీఆర్‌) 2023 పవర్డ్‌ బై ఆల్ట్‌ లైఫ్‌ , (షాపర్స్‌స్టాప్‌ కు చెందిన బ్రాండ్‌)విజయవంతంగా ముగిసింది. ఈ సంవత్సరం ఆరు వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా గత సంవత్సరంతో పోలిస్తే 100% వృద్ధి నమోదయింది. హాఫ్‌ మారథాన్‌ పోటీలో జేమ్స్‌ కిప్లీటింగ్‌ కోరిర్‌, హెత్‌ రామ్‌, రమావత్‌ రమేష్‌ చంద్రలు మొదటి మూడు స్ధానాల్లో నిలిచారు. 10కిలోమీటర్ల పరుగులో హుకమ్‌ హుకమ్‌, దీపక్‌ సుహాగ్‌, లక్ష్మీషా సీఎస్‌లు వేగవంతమైన రన్నర్లుగా నిలిచారు.

- Advertisement -

ఈ రన్‌ ఇనార్బిట్‌ మాల్‌, హైదరాబాద్‌ వద్ద ఆదివారం ఉదయం ప్రారంభమైంది. 21 కిలోమీటర్లల రన్‌ను తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక మరియు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీస్‌ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, ఐఏఎస్‌ ; కె రహేజా కార్పోరేషన్‌ తెలంగాణా–ఏపీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌ గోనె ప్రారంభించగా 10కె రన్‌ను తెలంగాణా ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ;శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య , తెలంగాణా ఐటీ చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి ; టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రావణ్‌కుమార్‌ ప్రారంభించారు. 5కె రన్‌లో దాదాపు 3వేల మంది పాల్గొన్నారు. ఈ రన్‌ను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌ , సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పొలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ కె నారాయణ్‌ నాయక్‌, ఐపీఎస్‌ ; సైబరాబాద్‌ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి , సైబరాబాద్‌ పోలీస్‌, ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ కృష్ణ యెదుల ప్రారంభించారు.

ఓ మహోన్నత కారణం కోసం ఐడీసీఆర్‌ రన్‌ను నిర్వహించారు. ఈ రన్‌ ద్వారా 54 లక్షల రూపాయలను సమీకరించారు. ఈ నిధులను తమ ఎన్‌జీవో భాగస్వామి నిర్మాణ్‌ ద్వారా దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల కోసం వినియోగించనున్నారు.

ఈ సంవత్సరం 25 కార్పోరేట్‌ సంస్ధల ఉద్యోగులు సైతం రన్‌లో పాల్గొన్నారు. ఐటీ పార్క్‌ మైండ్‌స్పేస్‌ నుంచే 850 రిజిస్ట్రేషన్‌లు ఈసారి జరిగాయి.

హైదరాబాద్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ మారథాన్‌ అండ్‌ డిస్టెన్స్‌రేసెస్‌ (ఎయిమ్స్‌) ధృవీకరణ పొందిన రెండు రేస్‌లలో ఐడీసీఆర్‌ ఒకటి. ఈ సంవత్సరం ఐడీసీఆర్‌కు ఆల్ట్‌ లైఫ్‌ బై షాపర్స్‌ స్టాప్‌ పవర్డ్‌ బై పార్టనర్‌గా, కమల్‌ వాచ్‌ కో టైమింగ్‌ పార్టనర్‌గా, హైడ్రేషన్‌ పార్టనర్‌గా లిమ్కా స్పోర్ట్జ్‌, రన్నింగ్‌ పార్టనర్‌గా స్కెచర్స్‌, రేడియో పార్టనర్‌ ఫీవర్‌ ఎఫ్‌ఎం వ్యవహరించాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...