Harish Rao | మహిళలకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ ఇదేనా?

-

Harish Rao |పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా అధికార బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్‌లో చేపట్టిన ఆందోళనలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసరాల ధరలు పెంచుతూ బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ఆదానీ, అంబానీలకు దేశ ప్రజల సంపదను మోడీ దోచిపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను మోడీ ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోందని ఆవేదన చెందారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ నిరుపేద ఇల్లూ సంతోషంగా లేదని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...