Harish Rao శుభవార్త.. నిరుపేదలకు కార్పొరేట్ తరహా వైద్యం!

-

Harish Rao |శస్త్ర చికిత్సలు చేసి పసిపిల్లలకు ప్రాణం పోసిన యూకే వైద్యులకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు సన్మానం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతీ వందమంది పిల్లల్లో ఒకరికి గుండె సంబంధిత సమస్య ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు శస్త్ర చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత ఉండదని, ఈ క్రమంలో అనేకమంది పేదలు సంతానాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదలకు కార్పొరేట్ తరహా సేవలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే దసరా పండుగ వరకు వరంగల్ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు.

- Advertisement -

రూ.6 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుందని  హరీష్ రావు(Harish Rao)  తెలిపారు. అంతేగాక, మరో 2 వేల పడకలతో నిమ్స్‌ను విస్తరిస్తామని అన్నారు. విదేశాల్లో ఉన్న వైద్య నిపుణులు సొంతగడ్డపై సేవలు అందించాలని పిలుపునిచ్చారు. వైద్య రంగంలోకి సరికొత్త విజ్ఞానం, సాంకేతికత అందించాలని కోరారు. ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత.. నిమ్స్‌లోనే తొలిసారి గుండె శస్త్రచికిత్సలు జరుగనున్నాయని అన్నారు. ప్రస్తుతం 3 నెలల చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని అన్నారు.

Read Also: తెలంగాణలో TRS పేరుతో కొత్త పార్టీ!!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మందుబాబులకు షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

Liquor Shops | తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి...

AB Venkateswara Rao | ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేత

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది....