Kriti Sanon | ‘ఆదిపురుష్’ చూసిన సీత.. ఫ్యాన్స్ ఏం చేశారంటే?

-

ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌(Adipurush)’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌, జానకిగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్(Kriti Sanon) నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(OM Raut) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా, గురువారం (జూన్‌ 15) రాత్రి ఆదిపురుష్‌ స్పెషల్‌ షో వేశారు. మూవీ యూనిట్‌, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ఈ స్పెషల్ స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోకు కృతి సనన్‌ కూడా హాజరైంది. ఆమెతో పాటు తల్లిదండ్రులు రాహుల్‌ సనన్‌, గీతా సనన్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా కృతి సనన్‌(Kriti Sanon)తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే ఆమె ఎంతో ఓపికగా వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగింది.

Read Also:
1. భీమవరంలో ‘ఆదిపురుష్’ సినిమా నిలిపివేత.. ఎందుకంటే?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...