Pakistan | పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 40 మంది దుర్మరణం

-

పాకిస్తాన్‌‌(Pakistan)లో జరిగిన భారీ బాంబు పేలుడులో 40 మంది మృతిచెందారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బజౌర్‌ జిల్లా ఖార్‌ పట్టణంలో అతివాద ఇస్లామిక్ పార్టీ “జమియత్ ఉలెమా ఏ ఇస్లాం-ఎఫ్” ఆదివారం నిర్వహించిన సభను టార్గెట్ చేసుకొని ఈ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 130 మంది గాయపడగా, వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Pakistan | తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ప్రాంతీయ రాజధాని పెషావర్‌కు విమానంలో తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ పేలుడులో జమియత్ ఉలెమా ఏ ఇస్లాం-ఎఫ్ పార్టీ స్థానిక అధ్యక్షుడు మౌలానా జియావుల్లా మరణించారు. ఈ సభలో పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ పాల్గొనలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: HYD పోలీసులపై MLA రాజాసింగ్ మరోసారి సీరియస్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...