ఎస్పీ నేతపై చెప్పుతో దాడి చేసిన యువకుడు

-

యూపీ రాజధాని లక్నో(Lucknow)లో జరిగిన సమాజ్‌వాద్ పార్టీ(SP)ఓబీసీ సమ్మేళనంలో ఆ పార్టీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య(Swami Prasad Maurya)పై ఓ యువకుడు దాడి చేశాడు. లాయర్‌ వేషంలో ఉన్న ఆ యువకుడు చెప్పులు కూడా విసిరాడు. దీంతో అక్కడ దుమారం చెలరేగింది. ఎస్పీ కార్యకర్తలు అతన్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్వామి ప్రసాద్‌ మౌర్యపై దాడి చేసిన ఆ యువకుడిని ఆకాష్‌ సైనీగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విభూతిఖండ్(Vibhuti Khand) పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

హిందూమతంపై స్వామి ప్రసాద్‌ మౌర్య(Swami Prasad Maurya) చేసిన వ్యాఖ్యలు తనను బాధించినట్టు చెప్పాడు ఆ యువకుడు. ఐతే అతను నిజంగా లాయరేనా లేక న్యాయవాది వేషంలో వచ్చాడా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. లక్నో ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌లో ఓబీసీ సమ్మేళనం జరుగుతోంది. ఈ సదస్సుకు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కూడా రావాల్సి ఉంది. అంతలోనే ఈ గొడవ జరిగింది.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్షా 40వేల జీతంతో ఉద్యోగాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....