బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి

-

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్త్ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్‌లో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది.

- Advertisement -

West Bengal | ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక, ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరికొందరు గాయాలపాలయ్యారు. మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి.

Read Also: అమిత్ షా సభపై ఈటల రాజేందర్ ధీమా
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....