Parigela Murali Krishna | కాంగ్రెస్‌లో చేరికల జోరు.. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..

-

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరందుకుంటున్నాయి. వరుసగా వైసీపీ నేతలు హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే నందికొట్కూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే, కోడుమూరు వైసీపీ సీనియర్ నేత పరిగెల మురళీకృష్ణ(Parigela Murali Krishna) కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా షర్మిల(YS Sharmila) ట్వీట్ చేస్తూ “కోడుమూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీ కృష్ణ(Parigela Murali Krishna) గారు వైసీపీ నుంచి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన సందర్భంగా ఆయనకు కండువా కప్పి సాదర స్వాగతం పలకడం సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో సమతుల్య అభివృద్ధి, సంక్షేమాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీ కీలకమని మురళీ కృష్ణ గారు భావిస్తున్నందున ఆయన చేరిక పార్టీకి బలం చేకూరుస్తుంది. ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇందిరమ్మ రాజ్యం పట్ల ప్రజల్లో ఉన్న అవసరాన్ని దృఢంగా తెలియజేస్తుంది” అని తెలిపారు. కాగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న మరికొంత నేతలు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు: కేటీఆర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...