Tamilisai | బీజేపీ మూడవ జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేసే సెగ్మెంట్ ఇదే

-

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్(Tamilisai) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను లోక్‌సభ బరిలో నింపుతూ బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఆమె పేరును ప్రకటించారు. తమిళిసైతో పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ.. తాజాగా మరో జాబితాను ప్రకటించింది.

- Advertisement -

ఈ జాబితాలో కేవలం తమిళనాడు సీట్లకు మాత్రమే అభ్యర్థులకు చోటు కల్పించారు. తమిళనాడులోని చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి తమిళిసై(Tamilisai) పోటీ చేయనున్నారు. ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి బరిలో దిగనున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి. సెల్వం.. వెల్లూర్ నుంచి ఏసీ షణ్ముగం.. కృష్ణగిరి నుంచి సీ. నరసింహన్.. నీలగిరి(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎల్ మురుగన్.. పెరంబలూర్ నుంచి టీఆర్ పారివేందర్.. తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్.. కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్‌లకు అవకాశం ఇచ్చారు.

Read Also: ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...