Anasuya | జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ వ్యాఖ్యలు వైరల్..

-

సినీ నటి అనసూయ(Anasuya) ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ పిలిస్తే జనసేన తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -

“పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గొప్ప నాయకుడు. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తాను. జబర్దస్త్‌లో రోజా, నాగబాబు ఇద్దరితో కలిసి పనిచేశాను. నాకు నాగబాబు గారు బాగా క్లోజ్. ఒకవేళ అటు నుంచి రోజా గారూ.. ఇటు నుంచి నాగబాబు గారూ పార్టీలోకి పిలిస్తే.. వెళ్తాను.. ఆయా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తాను. నాకు నాయకులతోనే పని. పార్టీలతో పని కాదు. నాకు చాలా పార్టీల లీడర్లు తెలుసు. వాళ్లని అభిమానిస్తాను. వాస్తవంగా నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. మా నాన్న గారు రాజకీయాల్లో ఉండేవారు. ఆయన పాలిటిక్స్ మానేయడానికి కారణం నేనే” అన్నారు.

“కానీ నేను ఈ సొసైటీలో ఉంటున్నాను కాబట్టి.. మంచి లీడర్‌ని ఎన్నుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. మంచి లీడర్‌ని ఎన్నుకోమని వేరే వాళ్లకి చెప్పడం.. వాళ్లు నా మాట వినడం అది నా అదృష్టం. నేను చెప్తే వింటారు కాబట్టి.. కరెక్ట్‌గా చెప్పాలి. నేను చెప్తే వింటారని ఏది పడితే అది చెప్పడం తప్పు. సినిమా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను వెళ్తాను. నేను వెళ్తే మాత్రం అభ్యర్థి గురించి పూర్తిగా తెలుసుకునే వెళ్తాను’ అంటూ వెల్లడించారు. దీంతో అనసూయ(Anasuya) వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...