సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

-

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టీవీ నారాయణ కుమారుడు వంశా తిలక్‌(Vamsha Tilak)ను తమ అభ్యర్థిగా వెల్లడించింది. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఖాయమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించగా.. బీఆర్ఎస్ పార్టీ నివేదితను అభ్యర్థిగా ఖారురు చేసింది.

- Advertisement -

కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. లాస్య మరణం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక(Cantonment Bypoll)కు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ జరగనుంది. మరి ఈ ఎన్నికలో సానుభూతితో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు ప్రజలు ఓటు వేస్తారో.. లేదంటే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.

Read Also: వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...