మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..

-

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఒడిశా(Odisha)లోని బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పాలసీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని వెల్లడించింది. కటక్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఒడిశా ఉప ముఖ్యమంత్రి పార్వతి పరీదా ప్రకటించారు. ఈ పాలసీని తక్షణం అమలవుతుందని తెలిపారు. మహిళా ఉద్యోగులు తమ రుతుక్రమం(Menstrual Leaves) సమయంలో తొలి ఒకటి లేదా రెండో రోజు సెలవు తీసుకునేలా నిబంధనలు రూపొందించామని చెప్పారు. మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

- Advertisement -

రుతు క్రమం సమయంలో మహిళలకు సెలవు కేటాయించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సమయంలో ఒడిశా(Odisha) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నెలలో మూడు రోజుల నెలసరి సెలవులు ఇవ్వాలంటూ 2022లో ఓ బిల్లును ప్రతిపాదించినప్పటికీ దానికి ఆమోదం లభించలేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళలకు ఈ నెలసరి సెలవులు ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాల్లో చేరడానికి ప్రోత్సాహం అందించినట్లవుతుంది. కానీ దీనిని అమలు చేయాలని సంస్థల యాజమాన్యాలను ఒత్తిడి తెస్తే వ్యతిరేకత రావచ్చు. అలాంటప్పుడు మహిళలకు ఉద్యోగావకాశాలు తగ్గొచ్చు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Read Also: అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన బాబు..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...