Ponnam Prabhakar | కుటుంబ సర్వే గలాటా.. ఆందోళన వద్దన్న మంత్రి పొన్నం

-

తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ సర్వే(Family Survey) మొదలైంది. దాంతో పాటుగా ఎన్యుమరేటర్లకు, ప్రజలకు మధ్య చిన్నపాటి గలాటాలు కూడా మొదలయ్యాయి. అసలు మా మతం ఎందుకు చెప్పాలని కొందరు ప్రశ్నిస్తుంటే, మా ఆస్తుల వివరాలు మీకెందకని మరికొందరు నిలదీస్తున్నారు. ఇంకొందరైతే ఎన్యుమరేటర్లు(Enumerators) వదలకుండా సమాచారం అడుగున్నారని వారిపైకి కుక్కలను కూడా వదిలిపెట్టిన ఘటనలు హైదరాబాద్‌లో తలెత్తాయి. దీంతో సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్తున్న ఎన్యుమరేటర్లు ఏం చేయాలో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సమాచారం ఇవ్వడానికి ప్రజలు నిరాకరిస్తుండటం, సరేలే అని వెనక్కు వెళ్తే పై బాస్‌లు చెడుగుడాడేస్తారన్న భయంతో బిక్కుబిక్కు మంటున్నారు ఎన్యుమరేటర్లు. ఈ పరిస్థితులపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందించారు. ప్రజలు నిశ్చింతగా తమ సమాచారం ఎన్యుమరేటర్లకు అందించొచ్చని, సమాచారం అంతా కూడా గోప్యంగానే ఉంటుందని అన్నారు.

- Advertisement -

‘‘87 వేల మంది ఎన్యుమరేటర్ల తో సర్వే కొనసాగుతోంది. ఈ సర్వే చేయడం వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదు. ఎవరూ ఆందోళన చెందవద్దు. సమాచారం అంతా కూడా గోప్యంగా ఉంటుంది. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల సర్వేకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిసింది. అది సరైన పద్దతి కాదు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలి. మెరుగైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో ఈ సర్వే కీలక పాత్ర పోషించనుంది’’ అని పొన్నం ప్రభాకర్ వివరించారు. సిద్దిపేటలోని హుస్నాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన అనంతరం ఆయన(Ponnam Prabhakar) ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుటుంబ సర్వే ఒక చారిత్రాత్మ ఘట్టమని పేర్కొన్నారు.

Read Also:  కాంగ్రెస్ విజయోత్సవాలపై కేటీఆర్ విసుర్లు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...