AP Budget | బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల.. ఏయే శాఖకు ఎన్ని నిధులంటే..!

-

AP Budget | ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రూ.  3.22 లక్షల కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీ లో మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టారు. శాసన మండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,51,162 కోట్లు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.

- Advertisement -

AP Budget – శాఖల వారిగా కేటాయింపులు: 

పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
జల్‌ జీవన్‌ మిషన్‌ కోసం రూ.2,800 కోట్లు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
పంచాయతీ రాజ్‌ శాఖకు రూ.18,847 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు
యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు
దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు

Read Also: విటమిన్-డీ లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసా?
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Meenakshi Natarajan | ‘పేదవాడి మొఖంపై చిరునవ్వు మన పనికి రాజముద్ర’

తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) శుక్రవారం బాధ్యతలు...

Vallabhaneni Vamsi | ‘నా బ్యారక్ మార్చండి’.. కోర్టుకెక్కిన వంశీ

వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు....