5 రోజుల్లో 10 లక్షల మందికి ఆహారం.. సీఎం సహకారంతోనే సాధ్యం: వంశీదాస

-

వరద బాధితులకు అందించిన సహాయంపై అక్షయపాత్ర(Akshaya Patra) విజయవాడ, గుంటూరు అధ్యక్షుడు వంశీదాస ప్రభు మాట్లాడారు. ఐదు రోజుల్లో తాము 10 లక్షల మందికి ఆహారం అందించినట్లు ఆయన స్పష్టం చేశారు. దివీస్ ల్యాబ్, ప్రభుత్వ సహకారంతో రికార్డు స్థాయిలో వరద బాధితులకు ఆహారం అందించామని వెల్లడించారు. ప్రభుత్వం ఎప్పుడు ఎంత అడిగినా అంత ఆహారం అందించడానికి ఈ ఐదు రోజులూ సిద్ధంగా ఉన్నామని, ఒక్కసారి కూడా కష్టం అన్న ఆలోచన కూడా రాకుండా ఆహారాన్ని అందించామని ఆయన వివరించారు. వరద బాధితులకు తమ వంతుగా సహకారం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

- Advertisement -

‘‘చంద్రబాబు(Chandrababu) సహకారంతోనే ఐదు రోజుల్లో 10 లక్షల మందికి ఆహారం అందించడం సాధ్యమైంది. తాము ఎంత ఆహారం వండినా ఆ మొత్తాన్ని వరద బాధితులకు అందించడం చాలా గొప్ప విషయం. ఇంత అన్న మార్జిన్ లేకుండా ఎంత ఉంటే అంత ఆహారాన్ని బాధితులకు అందించడంలో ప్రభుత్వం విశేషంగా పనిచేసింది. వారు అడిగినంత అందించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాం. 10 లక్షల మందికి ఆహారం అందించడం అక్షయపాత్ర(Akshaya Patra) చరిత్రలో ఇదే తొలిసారి. ఇది అక్షయపాత్రకు ఒక రికార్డు. ఇంకా ఇదే విధంగా ఇంకా ఎన్ని రోజులు కావాలన్నా ఆహారం అందించడానిక మేము సిద్ధంగా ఉన్నాం’’ అని వంశీదాస చెప్పారు.

Read Also: TPCC Chief నియామకం ఉత్కంఠకు తెర.. పార్టీ పగ్గాలు ఆయనకే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...