Ambati Rayudu |తాడేపలి సీఎం క్యాంపు కార్యాలయంలో అంబటి రాయుడు.. వైసీపీలోకి పక్కా?

-

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీలో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకుంటే తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి రాయుడు వెళ్లాడు. అనంతరం జగన్ తో భేటీ అయినట్లు సమాచారం. దీంతో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజుల కిందట రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని రాయుడు స్వయంగా చెప్పాడు. దీంతో అతను ఏ పార్టీలో చేరబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

- Advertisement -

గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు(Ambati Rayudu) టీడీపీలో చేరనున్నాడని ఒకసారి.. కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టి జనసేన తీర్థం పుచ్చుకుంటాడని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టేలా కొద్దిరోజుల క్రితం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో జగన్ ప్రసంగాన్ని రాయుడు రీట్వీట్ చేశాడు. ఏపీలో ప్రతి ఒక్కరికీ మీపై విశ్వాసం ఉంది సర్ అంటూ వ్యాఖ్యలు కూడా చేశాడు. తాజాగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లడంతో వైసీపీలో కచ్చితంగా చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also: వేసవిలో సింపుల్ స్కిన్ కేర్ టిప్స్
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...