మళ్ళీ పేలిన ఫార్మా.. నలుగురికి సీరియస్

-

అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాద ఘటన షాక్ నుంచి తేరుకోకముందే అనకాపల్లి(Anakapalle) ఫార్మా సిటీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్(Synergene Active Ingredients) సంస్థలో కెమికల్స్ కలుపుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, 70 శాతం కాలిన గాయాలతో వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా వారి నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరి పరిస్థితి మాత్రం చెప్పలేని స్థితిలో ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఈ ప్రమాదం అర్థరాత్రి 1 గంట సమయంలో చోటుచేసుకుంది. అయితే సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో జరిగిన ప్రమాదం కూడా ఎసెన్షియాలో జరిగిన విధంగా సంభవించినట్లు అధికారులు తమ ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు.

- Advertisement -

ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై, బాధ్యతుల పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేలా దర్యాప్తు చేపట్టాలని కూడా సూచించారు. మరి కాసేపట్లో హోం మంత్రి వంగలపూడి అనిత.. అనకాపల్లి(Anakapalle) ఫార్మాసిటీకి చేరుకోనున్నారు. అక్కడ ఈ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అదే విధంగా ఫార్మా సంస్థల భద్రతపై స్థానిక అధికారులతో కూడా సమావేశం కానున్నట్లు సమాచారం.

Read Also: సెజ్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ: చంద్రబాబు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...