AP BC Ministers Meeting: నేడు తాడేపల్లిలో బీసీ మంత్రుల సమావేశం

-

AP BC Ministers Meeting at Thadepalli CM camp office: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు బీసీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముత్యాలనాయుడుతో పాటు ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం జగన్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకర్షించేందుకు, ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఇతర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎటువంటి సంక్షేమ పథకాలను అందించారో, ప్రజలకు ఏ విధంగా వివరించాలో, ప్రతిపక్షాల ఆరోపణలు సమర్థవంతంగా ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై ఈ భేటీ (AP BC Ministers Meeting)జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాబోయే రోజులు మనవే.. పార్టీ నేతలతో కేసీఆర్..

ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్(KCR)...

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా.. అట్లుంటది మనతోని..

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ ఫలితాల్లో(UPSC Civil Service Results) తెలుగు రాష్ట్రాలకు...