అన్నీ మెడికల్ కాలేజీల్లో EWS అమలు

-

ఆర్థికంగా వెనకబడిన తగతుల వారికి అందించే రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్(EWS Quota). ఈ కోటా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికాలేజీల్లో ఈ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది సర్కార్. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో ఈ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఉత్తర్వులను కళాశాలలకు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో EWS కింద సీట్లు భర్తీ అవుతున్నాయి. అయితే ఈ కోటా కింద అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ జరగాలని నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది అక్టోబరులో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ ఈ నిర్ఱణయం తీసుకుంది.

- Advertisement -

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(NTR Health University) అనుబంధ మెడికల్ కాలేజీల్లో ఈ కోటా కింద 10శాతం సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. ఈ నిర్ణయం మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదని, ఎంబీబీఎస్తోపాటు పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కోటా(EWS Quota) వర్తిస్తుందని సర్కార్ తెలిపింది. అదే విధంగా సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇది వర్తించదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: అమరావతి రైల్వే లైన్‌కు తెలంగాణలో భూసేకరణ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...