AP Govt – Rapido | రాష్ట్రంలో మహిళలను సాధికారపరచే ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బైక్ టాక్సీ సర్వీస్ కంపెనీ ర్యాపిడోతో చేతులు కలిపింది. అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఈ-బైక్ లు, ఈ-ఆటోలను అందించి.. వారిని ర్యాపిడోతో అనుసంధానిస్తుంది.
మొదటగా విశాఖపట్నం, విజయవాడలలో సుమారు 400 ఈ-బైక్ లు, ఈ-ఆటోలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తరువాత కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి జిల్లాల కేంద్రాల్లో ప్రారంభించాలని భావిస్తోంది. ఈ నగరాలకు మొత్తంగా మరో 200 వాహనాలు లభిస్తాయి. నివేదికల ప్రకారం, ప్రభుత్వం ముద్ర పథకం, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల కింద మహిళలకు వాహనాలు కొనుగోలు చేయడానికి రుణాలు ఏర్పాటు చేయనుంది.
AP Govt – Rapido | ర్యాపిడోతో కుదిరిన ఒప్పందం ప్రకారం, ఈ వాహనాలను నడిపే మహిళలు మొదటి మూడు నెలలు కంపెనీకి ప్లాట్ఫామ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత వారు నెలకు రూ.1,000 చెల్లించాలి. బైక్ టాక్సీ కంపెనీ ప్రతి వాహనానికి నెలకు 300 బుకింగ్ లను అందిస్తుంది.