లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల లైసెన్సులు

-

AP Liquor License | ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల జారీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ లైసెన్సుల జారీని అధికారులు లాటరీ పద్దతిలో చేపడుతున్నారు. 26 జిల్లాల్లో ఉదయం 8 గంటల నుంచి ఈ లాటరీ పద్దతిని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇది కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది. గెజిట్‌లో ప్రచురించిన మద్యం దుకాణాల క్రమసంఖ్య ప్రకారమే ఈ లాటరీ తీయడం జరుగుతోంది. ఈ లాటరీ తీసే ప్రక్రియ మొత్తం కూడా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు గానూ 89,882 దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.

- Advertisement -

AP Liquor License | మొత్తం 26 జిల్లాలకు సంబంధించి ఈ లాటరీ ప్రక్రియ జరుగుతుండగా వీటిలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 40 దుకాణాలకు లైసెన్లు జారీ ప్రక్రియ జరుగుతోంది. అత్యధికంగా తిరుపతిలో 227 దుకాణాలను అధికారులు నోటిఫై చేశారు. వీటితో పాటు పలు ఇతర జిల్లాల్లో కూడా అంతంతమాత్రంగానే దరఖాస్తులు వచ్చాయి. అక్కడి ముఖ్యనేతలు ఇతరుల చేత దరఖాస్తులు వేయనీయకుండా అడ్డుకోవడం, మరికొన్ని చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారడమే ఇందుకు కారణం. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి రెండు, మూడు దరఖాస్తులే వచ్చాయి.

Read Also: వాయిదా పడ్డ కేటీఆర్ పరువు నష్టం దావా విచారణ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అక్రోట్లతో అద్భుతమైన ఆరోగ్యం..

ఆరోగ్యంపై అవగాహన ఇప్పుడిప్పుడే అధికం అవుతోంది. యువత కూడా తమ ఆరోగ్యంపై...

బాబర్‌పై వేటు.. పీసీబీ తీవ్ర ఆగ్రహం

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌(Babar Azam)పై ఆ దేశ క్రికెట్...