ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

-

AP Schools |ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 07.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతుల నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఉదయం 08:30 నుంచి 09:00 గంటల మధ్యలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయాలని సూచించింది. రాష్ట్రంలో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతోఒంటిపూట బడుల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సెలవుల పొడిగింపుపై మరోసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also:
1. విజయవాడలో ఎమ్మెల్సీ కారు బీభత్సం.. ఒకరు మృతి
2. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో తెలుగు హీరో
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....